Header Banner

4 రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో కుమ్మేయనున్న వానలు, పిడుగులు పడొచ్చు జాగ్రత్త!

  Fri May 02, 2025 15:59        Environment

తెలుగు రాష్ట్రాల్లో ఎండ వానలతో మిశ్రమ వాతావరణం కొద్ది రోజులపాటు కొనసాగుతుందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం, విశాఖ వాతావరణ కేంద్రం అధికారి కె.ఎస్. శ్రీనివాస్ వివరించారు. ముఖ్యంగా ఈ నాలుగు రోజులు అంటే శనివారం, ఆదివారం, సోమవారం వరకు కూడా కొన్నిచోట్ల వానలు, కొన్నిచోట్ల ఎండలు ఉండే అవకాశం ఉందని, కొన్ని చోట్ల వాతావరణం మిశ్రమంగా ఉంటుందని వివరించారు. తెలంగాణ, ఆంధ్రాలో పరిస్థితులు కొద్ది రోజులు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఉత్తర కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని, దీని ప్రభావంతో రానున్న నాలుగు రోజులు కోస్తాంధ్రలో మేఘావృతమైన వాతావరణంతో పాటు అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, రాయలసీమలో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. చెదురుమదురుగా భారీ వర్షాలు నమోదు కావచ్చని పేర్కొన్నారు. అలాగే మరో వైపు కొన్నిచోట్ల ఎండ తీవ్రత ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. రేపు, ఎల్లుండి ఉష్ణోగ్రతలు 40- 42°C మధ్య రికార్డు అయ్యే అవకాశం ఉందన్నారు.

 

ఇది కూడా చదవండి: ఏపీలో చిన్నారులకు తీపికబురు - 18 ఏళ్ల వరకు ప్రతి నెలా రూ.4 వేలు! ఈ పథకం గురించి తెలుసా, దరఖాస్తు చేస్కోండి!

 

ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద నిలబడరాదన్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏకధాటిగా దంచికొడుశుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా మేఘావృతమైన వాతావరణంతో పాటు కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.తోన్న భారీ వర్షాలు.. సముద్ర తీరంలో అల్లకల్లోలం! ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా మేఘావృతమైన వాతావరణంతో పాటు కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గురువారం సాయంత్రం 6 గంటల వరకూ అనకాపల్లి జిల్లా దార్లపూడిలో 66మి.మీ., ఎస్.రాయవరం లో 59మి.మీ., అచ్యుతాపురంలో 55మి.మీ., సాలపువానిపాలెం 51మి.మీ., కొప్పాక 47మి.మీ., ప్రకాశం జిల్లా అనుమలవీడు 44మి.మీ. చొప్పున, 24 ప్రాంతాల్ల్లో 30మి.మీ. కు పైగా వర్షపాతం నమోదైందన్నారు. నంద్యాల జిల్లా దోర్నిపాడులో 42.7°C, వైఎస్సార్ జిల్లా అట్లూరు మరియు కర్నూలులో 41.8°C, తిరుపతి జిల్లా వెంకటగిరి, చిత్తూరు జిల్లా తవణంపల్లె 41.7°C, అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట, ప్రకాశం జిల్లా చెరువుకొమ్ముపాలెంలో 41.5°C చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపారు.

 

ఇది కూడా చదవండి: పలు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన సీఎం చంద్రబాబు! లిస్ట్ ఇదుగోండి..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కూటమి ప్రభుత్వ రాకతో అమరావతి బంగారు బాట! ఇకపై ప్రతి ఆంధ్రుడు..

 

షాకింగ్ న్యూస్.. తెలుగు యూట్యూబర్ అనుమానాస్పద మృతి.. అతనే కారణమా?

 

గుడ్ న్యూస్! ఏపీలోనూ మెట్రోకు గ్రీన్ సిగ్నల్! ఎక్కడంటే?

 

గన్నవరం ఎయిర్‌పోర్టులో మరోసారి కలకలం.. ఈసారి ఏం జరిగిందంటే!

 

ప్రయాణించేవారికి శుభవార్త.. అమరావతికి సూపర్ ఫాస్ట్ కనెక్టివిటీ.. సిద్ధమైన కృష్ణా నదిపై వారధి!

 

అకౌంట్లలో డబ్బు జమ.. 1 లక్ష రుణమాఫీ. ప్రభుత్వం ఆదేశాలు.! గైడ్‌లైన్స్ విడుదల!

 

రూ.500 నోట్లకు ఏమైంది.. ఇక ఎటిఎంలలో 100, 200 నోట్లు.. RBI కీలక నిర్ణయం..!

 

మాజీ మంత్రి బిగ్ షాక్.. విచారణ ప్రారంభం! వెలుగులోకి కీలక ఆధారాలు..

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..

 

అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ‌ చిన్న పని తో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Rain #AndhraPradesh #APSDMA #Weather #CycloneDana